మామిళ్లగూడెం, డిసెంబర్ 16: పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సాంకేతికతను వినియోగిస్తున్నామని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ఎనిమిదో శుక్రవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1,033 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఇందులో 653 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు అర్హత సాధించారని వివరించారు. శుక్రవారం మొత్తం 1,226 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1,033 మంది హాజరై ఈవెంట్లలో పాల్గొన్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరేడ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.