చండ్రుగొండ, డిసెంబర్ 12: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం గానుగపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారుల మాటలు నమ్మి బయటి వ్యక్తులకు ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, సర్పంచ్ ధరావత్ పార్వతి, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, బీఆర్ఎస్ నాయకులు మాలోత్ భోజ్యానాయక్ , సారేపల్లి శేఖర్, సయ్యద్ గఫార్మియా, అంచకృష్ణ, అప్పారావు , పసుపులేటి రాధాకృష్ణ, సారంగి వెంకన్న, దావూద్మియా, కళ్లెం వెంకటేశ్వర్లు, సయ్యద్ బుజ్జి, సొసైటీ సీఈవో లంకా నరసింహారావు, రైతులు వేల్పుల లింగయ్య, అంచ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.