సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 6 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి అన్నారు. బేతుపల్లి పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం 6.60 లక్షల చేపపిల్లలను వదిలి మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్య సహకార సంఘాల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి బుజ్జిబాబు, సర్పంచ్ వేల్పుల కళావతి, మత్స్య సొసైటీ సభ్యులు కన్నారావు, జయరాజు, మారేశ్వరరావు, రామచందర్రావు, సత్యనారాయణ, రాంబాబు,నర్సింహారావు, నర్సింహులు, చెన్నారావు, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.