వేంసూరు, డిసెంబర్ 6 : రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. భీమవరం, లింగపాలెం, చౌడవరం తండా, వైఎస్ బంజరు, అడసర్లపాడు, రామన్నపాలెం గ్రామాల్లో మంగళవారం ఆయన పలువురు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల వెళ్లి అందజేసి మాట్లాడారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేను వృద్ధులు, మహిళలు పలుకరిస్తూ స్వాగతం పలికారు. రైతులు, పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుపుతూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వేంసూరు అంబేద్కర్ కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మి, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్ రెడ్డి, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, జిల్లా టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యులు మిరియాల ప్రసాద్, తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో రంజిత్కుమార్, పీఆర్ ఏఈ వాసు, ఏవో రామ్మోహన్రావు, ఆర్ఐ హరిప్రసాద్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.