మామిళ్లగూడెం/ఖమ్మం కల్చరల్/ ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 6: నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో నిలదొకుకుంటామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆటో క్యాడ్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరచిన ముగ్గురు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు కలెక్టర్ ల్యాప్ టాప్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సిల్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటీఐలో మూడు నెలల పాటు డ్రాఫ్టుమెన్ సివిల్లో శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఉరిమల్ల నాగరాజు, కందుల సంపత్, శీలం ఇందుకు మిత్ర, సామినేని ఫౌండేషన్ సహకారంతో ల్యాప్ టాప్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శిక్షణతో సొంతంగా ప్లాన్లు తయారు చేయడం, సర్వే చేసే స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, ఐటీఐ ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాసరావు, సుడా టీపీవో ఇటికాల భాసర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హుస్సేన్, మిత్ర ఫౌండేషన్, సామినేని ఫౌండేషన్ సభ్యులు కే ప్రవీణ్, సామినేని రవి, ఐటీఐ బోధకులు, సిబ్బంది పాల్గొన్నారు.