చింతకాని, డిసెంబర్ 6: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనాలుగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని పందిళ్ళపల్లి, గాంధీనగర్ గ్రామాల్లో మంగళవారం పల్లెప్రగతిలో ఏర్పాటు చేసిన నర్సరీ, డంపింగ్యార్డు, పల్లె పకృతి వనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గత వేసవిలో నిర్వహించిన ఈజీఎస్ పనుల రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హరితహరం లక్ష్యాన్ని కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులు, వనసేవకులు, సిబ్బంది సమష్టిగా చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాళంగి లలిత, కార్యదర్శులు నిఖిల్, నాగరాజు, టీఏ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
‘దళితబంధుతో ఆర్థిక పరిపుష్టి సాధించాలి’
చింతకాని, డిసెంబర్ 6: దళితబంధు పథకం ద్వారా యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. తిమ్మినేనిపాలెంలో మంగళవారం యూనిట్లు పొందిన లబ్ధిదారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. దళితబంధుతో దళితుల దశ దిశ మారనున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, సర్పంచ్ దమ్మాలపాటి శ్రీదేవి, కార్యదర్శి కన్నం రాజేశ్, ఉపసర్పంచ్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.