భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 26, 27, వచ్చే నెల 3, 4 తేదీల్లో బీఎల్వోలు విధుల్లో ఉండాలన్నారు. ఓటరు కూడా ఓటు హక్కు ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు దరఖాస్తు రిజిస్టర్లో భద్రపరచాలన్నారు. అన్ని ఫారాలను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
వీసీ నిర్వహించిన ఎన్నికల అధికారి..
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూర్యాపేట కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. వాల్పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. ఆటోల ద్వారా ప్రచారం ముమ్మరంగా చేయాలన్నారు. 17 సంత్సరాలు నిండిన వారి జాబితాను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు.