పినపాక, నవంబర్ 25: బీ(టీ)ఆర్ఎస్తోనే తమకు మేలు కలుగుతుందని అనేకమంది భావిస్తున్నారని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండలంలోని దుగినేపల్లి పంచాయతీలో వివిధ పార్టీలకు చెందిన 60 కుటుంబాల వారు శుక్రవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీ(టీ)ఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలందరినీ ఆకర్షిస్తున్నాయని, బీ(టీ)ఆర్ఎస్ పార్టీతోనే పేదలకు మేలు జరుగుతుందని నమ్ముతున్నారని చెప్పారు. పార్టీ సభ్యత్వమున్న ప్రతి ఒక్కరికీ రెండు లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జడ్పీటీసీ సభ్యురాలు దాట్ల సుభద్రాదేవి, నాయకులు వాసుబాబు, నరేష్రెడ్డి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభం
మణుగూరు టౌన్, నవంబర్ 25: మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మద్దులగూడెం వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే రేగా కాం తారావు శుక్రవారం ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
వాస్తు గురువుకు సన్మానం
అశ్వాపురం, నవంబర్ 25: మండలంలోని మొండికుంట నివాసి, వాస్తు గురువు పదిరావూరి శ్రీనివాసాచారి.. ఇటీవల థాయిలాండ్ దేశంలోని ఓ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మణుగూరులోని గిరిజన భవన్లో ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం సన్మానించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు సూదిరెడ్డి సులక్షణ, కొల్లు మల్లారెడ్డి, మర్రి మల్లారెడ్డి, కోడి అమరేందర్, కంచుగట్ల వీరభద్రం, వెన్న అశోక్కుమార్, జాలె రామకృష్ణారెడ్డి, మారోజు కృష్ణమాచారి, గద్దల రామకృష్ణ పాల్గొన్నారు.