కొణిజర్ల, నవంబర్22 : అర్హులకు పోడు పట్టాలు అందించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. మండలంలోని అన్నవరం గ్రామంలో పోడుభూముల పట్టాల కోసం మంగళవారం నిర్వహించిన గ్రామసభ తీరుతెన్నులను పరిశీలించి సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల నాగమణి, ఫారెస్ట్ స్పెషల్ ఆఫీసర్ హరిప్రసాద్, జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీడీవో ఆర్.రమాదేవి, ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
కామేపల్లి, నవంబర్ 22 : పోడు సర్వేలో తలెత్తిన సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నదని ఇంచార్జ్ ఎంపీడీవో గుప్తా అన్నారు. సర్వేపై మంగళవారం సర్పంచ్ అజ్మీరా రాందాస్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, ఎఫ్ఆర్వో రమేశ్, కార్యదర్శి పెండ్ర అనిల్కుమార్, ఏఈవో జగదీశ్వర్ పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 22 : పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమంలో భాగంగా మంగళవారం భవన్నపాలెం, గట్టుగూడెం, లింగగూడెం గ్రామాల్లో పోడు గ్రామసభలను నిర్వహించారు. ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి అధ్యక్షతన పోడుదారులకు అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభల్లో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, సర్పంచ్లు సోడే రాంబాబు, పద్దం వెంకటేశ్వర్లు, ఫారెస్టు అధికారులు పిచ్చేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి,నవంబర్ 22: గ్రామసభల ద్వారా పోడు భూముల సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. టేకులగూడెం, తొడిదలగూడెం, పంతులునాయక్ తండాలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోట రవికుమార్, సర్పంచ్లు అనసూర్య, బానోత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.