సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం, నవంబర్ 22: ఖమ్మం కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ కార్యాలయాన్ని మంగళవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ అఫ్జల్ హసన్ ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించారు. కల్లూరులోని యూనిట్ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, సత్తుపల్లిలో భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కల్లూరు, సత్తుపల్లిలో కార్యాలయాల నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నందగిరి శ్రీను, నాయకులు బుద్దా రామకృష్ణ, పురుషోత్తంరెడ్డి ఉన్నారు.