గ్రీవెన్స్లో మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి
ఖమ్మం నవంబర్ 21 : ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చిన దరఖాస్తుదారులకు వారంలోగా పరిష్కారం చూపాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో మేయర్, కమిషనర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని వినతులు అందజేశారు. తొలిరోజు తొమ్మిది మంది అర్జీలను అందించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆయా విభాగాల అధికారులకు పంపించి పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, జనన, మరణ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.