అన్నివర్గాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
కమ్మ వన సమారాధనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రఘునాథపాలెం, నవంబర్ 20: కమ్మ మహజన సంఘం ఐక్యంగా ఉండి ఇతర సంఘాలకూ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని చెరుకూరి మామిడి తోటలో ఆదివారం నిర్వహించిన కమ్మ వన సమారాధనలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతి గౌరవాన్ని నలుదిక్కులా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు.
ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.
ఖమ్మం అభివృద్ధికి సహకరించాలన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో 30 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వన భోజనాలు సామాజిక సమైక్యతకు నిదర్శనమన్నారు. అనంతరం 500 ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఎర్నేని రామారావు, తాళ్లూరి జీవన్కుమార్, వల్లభనేని రామారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.