నయీంనగర్, నవంబర్ 17: క్రీడల్లో గెలుపోటములు సహజమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. రెండు రోజులపాటు కేయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్ మీట్ – 2022 గురువారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడలు మానసిల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించి విశ్వవిద్యాలయానికి పేరు తేవాలని సూచించారు. లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
విజేతలు వీరే..
100 మీటర్ల మహిళల పరుగు పందెం
ఖమ్మం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన వీ సంధ్య మొదటి స్థానం, ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలకు చెందిన కే జంగాబాయి రెండు, ఖమ్మం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన టీ శ్రీ విద్య మూడో స్థానం సాధించింది.
400 మీటర్ల మహిళల పరుగు పందెం
ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు చెందిన బీ లిఖిత మొదటి స్థానం, ఖమ్మం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన శ్రీవిద్య రెండు, ఖమ్మం ప్రియదర్శిని డిగ్రీ కాలేజీకి చెందిన సీహెచ్ కీర్తన మూడో స్థానం.
800 మీటర్ల మహిళల పరుగు పందెం
మంచిర్యాలలోని సీవీ రామన్ కళాశాలకు చెందిన టీ హనీ మొదటి స్థానం, ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన బీ ఇందుప్రియ రెండు, టీఎస్డబ్ల్యూఆర్డీసీ ములుగుకు చెందిన టీ ప్రియాంక మూడో స్థానం సాధించింది.
1500 మీటర్ల పరుగు పందెం
కేయూ వ్యాయామ కళాశాలకు చెందిన ఎం కావ్య మొదటి స్థానం, ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు చెందిన ఎస్కే సమ్రీన్ రెండు, మంచిర్యాల్ సీవీ రామన్ కళాశాలకు చెందిన టీ హనీ మూడో స్థానంలో ఉంది.
5000 మీటర్ల మహిళల పరుగు పందెంలో
ఖమ్మం గీతాంజలి డిగ్రీ కాలేజీకి చెందిన పీ కామాక్షి మొదటి స్థానం, ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు చెందిన ఎస్కే సమ్రీన్ రెండు, ఉట్నూరు టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన పీ అన్నపూర్ణ మూడో స్థానంలో నిలిచింది.
10;000 మీటర్ల మహిళల పరుగు పందెం
విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన ఎం కావ్య మొదటి స్థానం, ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన పీ కామాక్షి రెండో స్థానం, ఉట్నూరు టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన పీ అన్నపూర్ణ మూడో స్థానంలో నిలిచింది.
మహిళల లాంగ్ జంప్లో..
హనుమకొండ వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన పీ అనురాధ మొదటి స్థానం, ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన టీ అంజలి రెండో స్థానం, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన ఏ కృష్ణవేణి మూడో స్థానంలో నిలిచింది.
మహిళల ట్రిపుల్ జంప్లో..
కొత్తగూడెం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన జే రాణి మొదటి స్థానం, బొల్లికుంట వాగ్దేవి వ్యాయామ కళాశాలకు చెందిన జీ అనురాధ రెండో స్థానం, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన ఆర్ భవాని మూడో స్థానంలో నిలిచింది.
మహిళల షాట్పుట్లో..
కొత్తగూడెం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన ప్రమీలారాణి మొదటి స్థానం, దమ్మపేట్ టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన సీతామహాలక్ష్మి రెండో స్థానం, ఖమ్మం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన ఎస్ సింధు మూడవ స్థానంలో నిలిచింది.
మహిళల డిస్త్రోలో..
కొత్తగూడెం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన ప్రమీలరాణి, జే రాజేశ్వరి మొదటి స్థానం, రెండవ స్థానం, దమ్మపేట టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన మాధవి మూడో స్థానంలో నిలిచింది.
మహిళా జావెలిన్ త్రోలో..
దమ్మపేట టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన టీ సీతామహాలక్ష్మి మొదటి స్థానం, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన వీ పూర్ణిమ రెండు, ఆసిఫాబాద్ టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన ఎ సోంబాయి మూడవ స్థానంలో నిలిచింది.
మహిళల పరుగు పందెంలో..
ఖమ్మం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన సంధ్య, జే శ్రీవిద్య, జి.మానస, పీ సుష్మిత మొదటి స్థానం, కొత్తగూడెం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన జే రాణి, బీ మౌనిక, ఎస్ విజయశాంతి, వీ శ్రుృతి రెండు, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన ఎం కావ్య, కే రమణ, ఆర్ భావన, ఏ కృష్ణ వేణి మూడో స్థానంలో ఉంది.
విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన ఆర్ భవాని, ఎస్ సోని, ఏ కల్యాణి, ఏ మానస మొదటి స్థానం, కొత్తగూడెం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన కే భావన, కే కల్యాణి, జే రాజేశ్వరి, ఎస్ సుష్మశ్రీ రెండో స్థానం, ఖమ్మం టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన వీ సుప్రియ, పీ నాగమణి, డీ ఊర్మిళ, జ్యోతిరెడ్డి మూడో స్థానంలో నిలిచింది.
100 మీటర్ల పురుషుల పరుగు పందెం..
జనగామ శ్రీవికాస్ డిగ్రీ కాలేజీకి చెందిన పీఎస్ అభిలాష్ మొదటి స్థానం, మర్రిపెడ టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన బీ రాము, బీ అనిల్ రెండు, మూడో స్థానంలో నిలిచారు.
400 మీటర్ల పురుషుల పరుగు పందెంలో..
హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన వీ దుర్గారావు, బీ హరీశ్ మొదటి, రెండు స్థానం, కొత్తగూడెం ఎస్ఆర్ఎఎస్ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన ఎస్కే షారుఖ్ మూడో స్థానంలో నిలిచారు.
800 మీటర్ల పురుషుల పరుగు పందెంలో..
ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు చెందిన వీ రాజు మొదటి స్థానం, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన వీ దుర్గారావు రెండు, జనగామ ఏబీవీ డిగ్రీ కాలేజీకి చెందిన జీ ఉదయకిరణ్ మూడవ స్థానంలో నిలిచారు.
1500 మీటర్ల పురుషుల పరుగు పందెంలో..
ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు వీ రాజు, వీ జ్ఞానేశ్వర్ మొదటి, రెండు స్థానాలు, ఆదిలాబాద్ మహర్షి డిగ్రీ కాలేజీకి చెందిన ఎస్ వంశీ మూడో స్థానంలో నిలిచారు.
5000 మీటర్ల పురుషుల పరుగు పందెంలో..
ఖమ్మం విశ్వవిద్యాలయ పీజీ సెంటర్ విద్యార్థి బీ విష్ణు మొదటి స్థానం, ఖమ్మం కవితా డిగ్రీ కాలేజీ నుంచి ఎల్ విక్రం రెండు, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు చెందిన ఎన్ నరేందర్, మూడో స్థానంలో నిలిచారు.
10,000 మీటర్ల పురుషుల పరుగు పందెంలో..
ఖమ్మం వ్యాయామ కళాశాలకు చెందిన బీ విష్ణు మొదటి స్థానం, ఖమ్మం కవిత డిగ్రీ కాలేజీకి చెందిన ఎల్ విక్రం రెండు, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన ఈ రోహిత్ మూడో స్థానంలో నిలిచారు.
పురుషుల లాంగ్ జంప్లో..
జనగామ ఏబీవీ డిగ్రీ కాలేజీ నుంచి జీ చరణ్ మొదటి స్థానం, ఇల్లందు సాహితి డిగ్రీ కాలేజీ నుంచి సుదర్శన్ రెండు, మణుగూరు టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన ఎస్కే ఆదం షఫీ మూడో స్థానంలో నిలిచారు.
పురుషుల ట్రిపుల్ జంప్లో..
విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాలకు చెందిన ఎస్ అశోక్ మొదటి స్థానం, బొల్లికుంట వాగ్దేవి వ్యాయామ కళాశాలకు చెందిన కే శ్రీశైలం రెండు, బొల్లికుంటకు చెందిన వై సతీశ్ మూడవ స్థానంలో నిలిచారు.
పురుషుల షాట్పుట్లో..
ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కు చెందిన ఎస్కే మాజిద్పాషా మొదటి స్థానం, ఖమ్మం కేఏండీసీకి చెందిన ప్రశాంత్, డీ రామకృష్ణ రెండు, మూడో స్థానంలో నిలిచారు. పురుషుల డిసస్త్రోలో హనుమకొండ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నుంచి డీ రామకృష్ణ మొదటి స్థానం, వరంగల్ కిట్స్కు చెందిన డీ అనిల్ రెండు, ఖమ్మం విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాలకు చెందిన కే నవీన్ మూడో స్థానంలో ఉన్నారు. పురుషుల జావెలిన్త్రో లో విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన పీ వంశీ, పీ వినేశ్ మొదటి, రెండు, మానుకోట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన బీ అనిల్ మూడో స్థానంలో ఉన్నారు.
పురుషుల పరుగు పందెంలో..
ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కి చెందిన ఎస్కే మజీద్ పాషా, బీ అనిల్, ఏ విజయ సారథి, వీ రాజు మొదటి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీకి చెందిన జీ దేవా, డీ శివసాయి, సాకేత్, ఎం గణేశ్ రెండో స్థానం, మర్రిపెడ టీఎస్డబ్ల్యూఆర్డీసీకి చెందిన బీ అనిల్, వీ మహేందర్, బీ రాము, ఈ తేజ మూడో స్థానంలో నిలిచారు.
పురుషుల పరుగు పందెంలో..
కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన బీ హరీశ్, బీ రమేశ్, వీ దుర్గారావు, ఆర్ రవితేజ మొదటి స్థానం, ఖమ్మం ఎస్ఆర్ అండ్బీజీఎన్ఆర్కు చెందిన బీ జ్ఞానేశ్వర్, ఎన్ నరేందర్, ఎస్ అజయ్, కే రాజు రెండు, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాలకు చెందిన ఎం బీరప్ప, ఎస్ అశోక్, ఎన్ రాజు, ఈ కృష్ణ మూడో స్థానంలో నిలిచారు.