ఖమ్మం వ్యవసాయం, మార్చి 31 : ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల క్రితం ఆమె అనర్హులకు మత్స్యపారిశ్రామిక సభ్యత్వాలు ఇచ్చినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అదే విధంగా శాఖాపరమైన తప్పిదాలను సైతం చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలోనే సదరు అధికారిపై వేటు పడినట్లు తెలుస్తోంది. కాగా, షకీలాబాను స్థానంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వరదారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన గురువారం ఉదయం ఖమ్మం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.