సత్తుపల్లి టౌన్, ఆగస్టు 14 : స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గ ప్రజలకు ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను 15 రోజుల పాటు నిర్వహించుకోవడం హర్షించదగిన విషయమమన్నారు.
దేశభక్తిని, జాతీయ భావాన్ని, స్వాతంత్య్ర సమరయోధుల పోరా టపటిమలను, వీరగాథలను, చరిత్రను భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ద్వారా నేటితరానికి అర్ధమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడం తెలంగాణ ప్రభుత్వ గొప్పవిషయమన్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు సైతం ఎమ్మెల్యే సండ్ర ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.