సత్తుపల్లి, ఆగస్టు 14 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చేయూత అందించి పాఠశాల అభివృద్ధికి దాతలు దోహదపడడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదవతరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.10వేలను దాతలు అందించగా వాటిని ఆదివారం ఎమ్మెల్యే అందించి మాట్లాడారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు తాము ఈ చిరు సహాయం అందించినట్లు దాతలు వివరించారు. కార్యక్రమంలో నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి రామారావు, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, భీమిరెడ్డి గోపాలరెడ్డి, చింతల సురేందర్రెడ్డి, గుర్రాల సురేశ్, దేశిరెడ్డి నాగిరెడ్డి, గొర్ల వెంకటరెడ్డి, ఎర్రబాబు, కొప్పుల నరేందర్రెడ్డి, రామ్మోహనరెడ్డి, మద్దికుంట్ల శ్రీను, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, ఆగస్టు 14 : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జన్మదిన వేడుకలకు సంబంధించి సండ్ర అనుచరులు, అభిమానులు ముద్రించిన పోస్టర్ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, నరుకుళ్ల శ్రీను, కాకర్లపల్లి ఉపసర్పంచ్ ఏగోటి పెద్దిరాజు, గోగులమూడి బాలాజీరెడ్డి, మిద్దే శ్రీను, బుడేన్, వలీ తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, ఆగస్టు 14 : బయ్యన్నగూడెంలో టీఆర్ఎస్ నాయకుడు కోమటి ప్రసాద్ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సండ్ర పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కనగాల వెంకటరావు, చెక్కిలాల మోహన్రావు, భూక్యా మందడపు అశోక్కుమార్, కోమటి అలేఖ్య, దొంతు లక్ష్మణ్ తదితరులున్నారు.