ఖమ్మం, ఆగస్టు 14: రాజనీతిజ్ఞుడు, ఆదర్శప్రాయుడు చేకూరి కాశయ్య అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నగరంలోని లకారం ట్యాంక్బండ్పై నగర కమ్మ సంఘం ఏర్పాటు చేసిన కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన మహోన్నతుడు కాశయ్య అని కొనియాడారు.
గాంధీ సిద్ధాంతాలను ఆచరణలో చూపిన మహానుభావుడన్నారు. జిల్లాలో ఎంతోమందికి రాజకీయ పాఠాలు నేర్పిన ఘనత ఆయనదేన్నారు. కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా, పరిషత్తు అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా ఆయన ప్రజా సేవ చేశారని, ఎనిమిదేళ్లు సమితి అధ్యక్ష పదవి, 11 సంవత్సరాలు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు జడ్పీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంతోమంది మన్ననలు పొందిన నాయకుడు కాశయ్య అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డీసీంఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా ముక్తార్, కేతినేని హరీశ్చంద్ర, కర్నాటి కృష్ణ, వల్లభనేని రామారావు, రమాదేవి, బిక్కసాని ప్రశాంత లక్ష్మి, రోహిణి, శ్రావణి, బత్తుల మురళి ప్రసాద్, కోటేశ్వరరావు, సతీశ్, సైదిబాబు, సత్యనారాయణ, మనోహర్రావు, ప్రసన్న కృష్ణ, నాగేశ్వరరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, శ్రీను, రామబ్రహ్మం, గోపి పాల్గొన్నారు.