సత్తుపల్లి, ఆగస్టు 12: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తోబుట్టువులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు మిఠాయిలు తినిపించి రాఖీలు కట్టారు. పట్టణంలోని వేంసూరు రోడ్డులోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పెనుబల్లి, ఆగస్టు 12: స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ లక్కినేని అలేఖ్య, మహిళలు వీరతిలకం దిద్ది రాఖీ కట్టారు.
సత్తుపల్లి టౌన్, ఆగస్టు 12: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ సమైక్య రక్షాబంధన్ నిర్వహించాలని ఇచ్చిన పిలుపుమేరకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలు కేసీఆర్ కటౌట్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణంలోని గుడిపాడు రోడ్లోని త్రివేణి పాఠశాలలో విద్యార్థ్ధులు రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు అక్కాచెల్లెళ్లు అన్నాతమ్ములకు అప్యాయత అనురాగాలతో రాఖీలు కట్టి తమ సోదర ప్రేమను చాటుకున్నారు.
వేంసూరు, ఆగస్టు 12: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మహిళా ప్రజాప్రతినిధులు, ఆసరా మహిళలు రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని చాటుకున్నారు.
కొణిజర్ల, ఆగస్టు12: రాఖీ పండుగ సందర్భంగా మండలంలోని మల్లేపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు.
కారేపల్లి, ఆగస్టు 12: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపులో భాగంగా టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మహిళా మండల ఉపాధ్యక్షురాలు పప్పుల నిర్మల, మాజీ ఎంపీపీ బానోత్ పద్మావతి, అప్పాయిగూడెం సర్పంచ్ అజ్మీరా అరుణ, మహిళా నాయకురాలు తోటకూరి శోభారాణి సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
వైరా, ఆగస్టు 11: రాఖీ పండుగను పురస్కరించుకుని ఏన్కూరు ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి ఆధ్వర్యంలో ఏన్కూరు టీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఏన్కూరులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పాల్గొన్నారు. విద్యాలయ స్పెషలాఫీసర్ ఉషారాణి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఏన్కూరు ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి ఎమ్మెల్యేకు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.
పట్టణంలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్కు చిన్నారులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
వైరారూరల్, ఆగస్టు 12: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా అన్నలకు చెల్లెళ్లు రాఖీ కట్టి ఒకరికొకరు మిఠాయి పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కామేపల్లి, ఆగస్టు, 12: రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రతి సోదరి రక్షాబంధన్ కట్టి హారతులు పట్టి దీవించి వారి నుంచి దీవెనలు పొందారు. మండల వ్యవసాయాధికారి తారాదేవి తన సోదరులు పంట చేలో ఉండడంతో చేలోకి వెళ్లి సోదరులకు రాఖీ కట్టారు.
కల్లూరు, ఆగస్టు 12: పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే సండ్రకు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటుకున్నారు.
తల్లాడ, ఆగస్టు 12: అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనురాగానికి, అప్యాయతకు ప్రతీక అయిన రాఖీ పండుగ వేడుకలను మండలంలో నిర్వహించారు. అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్ తినిపించుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.