ఖమ్మం రూరల్, ఆగస్టు 12: స్వతంత్ర వజోత్సవాలను మండలంలో పలు పాఠశాలల్లో నిర్వహించారు. శుక్రవారం కామంచికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో రిలయన్స్ ఫౌండేషన్ తెలంగాణ సంస్థ వ్యాసరచన పోటీలు నిర్వహించింది. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతలు అందజేశారు. సీహెచ్ వరహాలు, రమేశ్, వెంకటేశ్వర్లు, వాణిశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంగళగూడెం పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజంపై అవగాహన కల్పించారు.
పీ నాగిరెడ్డి, వీ యాదగిరి, పంజాల ఐలయ్య, బీ శ్రీనివాసరావు, డీవీఎన్ రెడ్డి, నంద్యా, పాపారావు పాల్గొన్నారు. గుదిమళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతలు భారీ వితరణ చేశారు. గ్రామానికి చెందిన పేరం వెంకటేశ్వర్లు, పేరం రవి, పేరం ఉపేందర్ వారి తల్లితండ్రుల జ్ఞాపకార్థం రూ.2లక్షల విలువైన బూట్లు, బ్యాగులను విద్యార్థులకు అందజేశారు. ఆర్ వీరస్వామి, బాలజీ, పీ రామారావు, త్రివేణి, బీ రాములు, శ్రీలక్ష్మి, పుల్లయ్య, ఉషారాణి, జీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మధరరూరల్, ఆగస్టు 12: మండల పరిధిలోని నాగవరప్పాడు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ గీతాలాపన చేశారు. సర్పంచ్ నాగమణి, టీచర్లు మోరబోయిన ఉషారాణి, తెల్లమేకల సరిత, ఆయాలు అక్కమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, ఆగస్టు 12: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు అన్నారు. శుక్రవారం ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు నిర్వహించిన క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. ఉపసర్పంచ్ దేవరకొండ అనిల్కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్నం రాము, వెంకటనారాయణ, ప్రిన్సిపాల్ పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ పీవో రామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.