ములకలపల్లి, జూన్10 : దళితుల ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్యతో కలిసి శుక్రవారం ఆయన మండలంలో విస్తుృతంగా పర్యటించారు. మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్యతో కలిసి అందజేసి మాట్లాడారు.
లబ్ధిదారులు మరింత శ్రమించి ప్రభుత్వం ఇచ్చిన దానిని రెట్టింపు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ దళిత బందు పథకం నిరంతరాయంగా అమల్లో ఉంటుందని, గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి వర్తింపజేస్తామన్నారు. జడ్పీచైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ దళితుల ఉద్దరణకు కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పవేశపెట్టారన్నారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా, జడ్పీచైర్మన్ కోరం, కలెక్టర్ అనుదీప్ అన్నారం గ్రామశివారులోని పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసారు.
కార్యక్రమంలో సీఈవో విద్యాలత, డీఆర్డీవో మధుసూదన్రావు, డీపీవో రమాకాంత్, తహసీల్దారు వీరభద్రం, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీవో లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ పుల్లారావు, ఎంపీటీసీలు శనగపాటి మెరహమణి, మడకం విజయ, తాటి సునీత, కొర్రి వీరభద్రం, సర్పంచ్లు గొల్ల పెంటయ్య, బైటి రాజేశ్, వాడే నాగరాజు, సున్నం సుశీల, కారం సుధీర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, మండల కార్యదర్శి శనగపాటి అంజి, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, టీఆర్ఎస్ నాయకలు పుష్పాల చంద్రరావు, కరుటూరి కృష్ణ, పామర్తి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి, జూన్10 : జగన్నాథపురానికి చెందిన బ్యాంకు అధికారులు ఖాతాదారులను వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ పాత గంగారం ఎంపీటీసీ మడకం విజయ శుక్రవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.