కూసుమంచి, మే 23: దివ్యాంగులపై ఆధరణ చూపాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. జిల్లా మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాల కారణాల చేత అవయవాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి ‘అలెంకో’ సంస్థ ఉపకరణాలు అందివ్వడం అభినందనీయమన్నారు.
స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ట్రై సైకిల్ రాని దివ్యాంగులు నిరాశ పడొద్దని, నడవలేని దివ్యాంగులకు తన సొంత ఖర్చులతో ట్రై సైకిళ్లు ఇస్తానిని హామీ ఇచ్చారు. అందుకు మండల పరిషత్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని కూసుమంచి, ఖమ్మం రూరల్ ఎంపీడీవోలు కరుణాకర్రెడ్డి, అశోక్కు సూచించారు. ఐసీడీఎస్ పీడీ సంధ్యారాణి మాట్లాడుతూ దివ్యాగులకు ఉపకరణల కోసం ఎమ్మెల్యే కందాళ, ఎమ్మెల్సీ తాతా మధు ప్రత్యేక చొరవ చూపారన్నారు.
అలెంకో సంస్థ ప్రతినిధులు డాక్టర్ రాకేవ్ పట్నాయక్, వెంకటయ్య, సురేందర్, కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బోడీ మంగీలాల్, సీడీపీవో బాలత్రిపుర సుందరి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ చైర్మన్ రామసహాయం బాలకృష్ణారెడ్డి, రూరల్ జడ్పీటీసీ వరప్రసాద్, మార్కెట్ చైర్మన్ సేట్రాంనాయక్, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, రూరల్ సీడీపీవో సరస్వతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బ్రహ్మయ్య, వేణు, వీరయ్య, వీరన్న, డీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎంపీవో రామచందర్రావు పాల్గొన్నారు.
రైతులు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగులు, పిల్లిపెసర వంటివి వేసుకొని భూ సారాన్ని పెంచుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. కూసుమంచిలోని కల్లూరిగూడెం సొసైటీలో చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఏడీఏ విజయ్చంద్ర, ఏవో వాణి, ఏఈవో జానీ బాబా, పరశురాం, లాలు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, మే 22: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 33మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ముగ్గురు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీపీ బోడ మంగీలాల్, సొసైటీ చైర్మన్ చావా వేణు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బాషబోయిన వీరన్న, దేవరం దేవేందర్రెడ్డి, నాయకులు ఆలిస్యం నాగేశ్వరావు, వంచర్ల సత్యనారాయణరెడ్డి, బానోత్ భిక్షం, ఆర్మి రవి, గుగ్గిళ్ల అంబేడ్కర్, సంగిశెట్టి ఉపేందర్, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో బానోత్ జయరామ్ నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం కాకరవాయి మాజీ సర్పంచ్ గూడు రు లక్ష్మీకాంతయ్యను ఎమ్మెల్యే పరామర్శించారు.