తల్లాడ/ కల్లూరు, మే 23 : రైతులు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా రైతుబీమాను అందిస్తున్న ఘనత దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తల్లాడ సొసైటీలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో 8,444 టన్నుల జీలుగులు, 1,444 టన్నుల పిల్లిపెసలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. దీనిద్వారా రైతులకు 4.30 కోట్ల సబ్సిడీ అందుతుందన్నారు. 30కిలోల జీలుగుల ప్యాకెట్ రూ.1897.50 ఉండగా ప్రభుత్వం 65శాతం రాయితీతో రూ.664.20లకు అందజేస్తుందన్నారు. పిల్లిపెసలు రూ.1770 ఉండగా రూ.619లకు అందజేస్తుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులు పచ్చిరొట్ట విత్తనాలు పొలాల్లో చల్లడం ద్వారా పొలానికి మంచి పోషకాలు అంది బలం చేకూరుతుందన్నారు.
నియోజకవర్గంలోని ఏన్కూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకట్లాల్, ఏఎంసీ వైస్చైర్మన్ భద్రరాజు, వ్యవసాయాధికారి తాజుద్దీన్, సొసైటీ వైస్ చైర్మన్ సత్యం, ఎంపీటీసీ తిరుమలాదేవి పాల్గొన్నారు.
కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర రైతులకు జీలుగు విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ నెల 27వ తేదీన కల్లూరు జూనియర్ కళాశాల ఆవరణలో స్టేడియం నిర్మాణ పనులకు కలెక్టర్తో కలిసి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, రైతుబంధు సమితి సభ్యుడు లక్కినేని రఘు, కో-ఆప్షన్ సభ్యుడు కాటంనేని వెంకటేశ్వరరావు, ఏవో రూప, మండల కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, పెడకంటి రామకృష్ణ, అంజిబాబు పాల్గొన్నారు.