ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం కుటుంబసమేతంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర సహకార ఎఫెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవిందర్రావు కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దక్షిణభారతదేశంలోనే యాదాద్రి నిర్మాణం ప్రత్యేకత కలిగిందన్నారు.
అద్భుతమైన శిల్పకళాసంపద, గోపుర నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు.