చింతకాని/ బోనకల్లు, సెప్టెంబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఎస్సీలందరూ ఆర్థికంగా స్థిరపడాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. చింతకాని మండలంలో పాతర్లపాడు, రైల్వేకాలనీ, జగన్నాథపురం తదితర గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. దళితబంధు కింద లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యూనిట్లు, ఆదాయ వ్యయాలు, వనరులు తదితర అంశాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డెయిరీ యూనిట్లలో భాగంగా పాతర్లపాడులో 100 గేదెలను పరిశీలించి లబ్ధిదారులతో చర్చించారు. షెడ్ల నిర్మాణాలు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వేకాలనీలో హర్వెస్టర్, జేసీబీ, ఫొటో్రగ్రఫీ యూనిట్ల లబ్ధిదారులతో మాట్లాడారు. జగన్నాథపురంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇప్పటికే ఖాతాల్లో నగదు జమ అయిన దళిత కుటుంబాలు యూనిట్లను గ్రౌండింగ్ చేసుచోవాలని సూచించారు. అదనపు స్నేహలత మొగిలి, ప్రజాప్రతినిధులు, అధికారులు కాండ్ర పిచ్చయ్య, పరిటాల యలమంద, ఆలస్యం నాగయ్య, శ్రీనివాసరావు, మల్లెల రవీంద్రకుమార్, వినోద్, పల్లపు రవీందర్, విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.
బోనకల్లులో జడ్పీ చైర్మన్, కలెక్టర్ పర్యటన..
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మంగళవారం బోనకల్లు మండలంలో ఆయన పర్యటించారు. రైల్వే ఓవర్బ్రిడ్జి కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే నేడు గ్రామాలు, పట్టణాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. ఆర్వోబీ కింద ఇటీవల పలు రకాల షాపులు ఏర్పాటు చేసుకొని జీవించిన వారిని గుర్తిస్తామని, వారు చిరు వ్యాపారులు చేసుకునేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని గుర్తిస్తామని అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్వోబీ కింద తొలగించిన షాపుల స్థలాల్లో అభివృద్ధి పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేసిన సర్పంచ్ సైదానాయక్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పుల్లారావు, రావూరి రాధిక, వేణుమాధవ్, శాస్త్రి, కంకనాల సౌభాగ్యం, భుక్యా సైదానాయక్, యార్లగడ్డ రాఘవ, మోదుగుల నాగేశ్వరరావు, గుండపునేని సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు.