ఖమ్మం రూరల్, మే 1: మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తుందని, అయితే కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతానికి 2 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందని తెలిపారు. ప్రైవేటులో మక్కలకు ధర పడిపోవడంతో రైతులు భారీగా మార్క్ఫెడ్కు తీసుకొస్తున్నారని చెప్పారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. అయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకును ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తునందని పేర్కొన్నారు. డీఎంవో అలీం, ఏఎంసీ సెక్రటరీ వీరాంజనేయులు, మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వినయేందర్రెడ్డి ఉన్నారు.