‘గ్రౌండింగ్’ పర్యవేక్షణకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులు
యూనిట్ల గ్రౌండింగ్ సమీక్ష సమావేశంలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, జూలై 6: జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి వంద యూనిట్లు చొప్పున మంజూరు చేసినందున వాటి గ్రౌండింగ్ కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఫొటోగ్రఫీ, డీజే, టైలరింగ్ సంబంధిత యూనిట్లకు డీఆర్డీవో, లైవ్ స్టాక్ యూనిట్లకు జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి, వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు జిల్లా వ్యవసాయాధికారి, మెడికల్ సంబంధిత యూనిట్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, సివిల్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ సంబంధిత యూనిట్లకు పంచాయతీరాజ్ ఈఈ, ఉత్పాదక, పరిశ్రమలకు ఇండస్ట్రీస్ జీఎం, రవాణా సంబంధిత యూనిట్లకు డీటీవోలను సెక్టోరియల్ అధికారులగా నియమించినట్లు వివరించారు. లాభదాయక యూనిట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా లబ్ధిదారుల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. యూనిట్ల వారీగా లబ్ధిదారులతో సమావేశమై వారికి అవగాహన కల్పించాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ వివరాలను ప్రతి రోజూ ఆన్లైన్లో అప్డేట్ చేయాలని, చేసిన వాటి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎస్డీసీ దశరథ్, డీఏవో విజయనిర్మల, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, డీటీవో కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.
15 నుంచి రెవెన్యూ సదస్సులు
పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిషారానికి చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. సదస్సులకు సిద్ధంగా ఉండి పెండింగ్ కేసుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్ఆర్యూపీ, రెవెన్యూ సదస్సులు ఇది వరకే చేపట్టి ఉన్నందున దీనిపై రెవెన్యూ అధికారులకు అవగాహన ఉందన్నారు. సాదాబైనామా ఖాతాల పెండింగ్ వివరాలు సమర్పించాలన్నారు. పీవోటీ కేసులు ఎన్ని పరిషారమయ్యాయి? ఇంకా ఎన్ని పెండింగులో ఉన్నాయి? అనే నివేదిక సమర్పించాలని సూచించారు. చెరువు శిఖం భూమి మినహాయించి ఎంత మేర ప్రభుత్వ భూమి ఉన్నది? ఎంత మేర సాగులో ఉన్నది? అనే నివేదిక కూడా ఇవ్వాలన్నారు. ఈపీపీబీ జారీ అయి, ఎంత వరకు ప్రభుత్వ భూమి అసైన్డ్ చేయబడింది? ఇంకా ఎంత వరకు అసైన్డ్ భూమి పీపీబీలు జారీ కాకుండా ఉన్నది అనేది కారణాలతో నివేదిక సమర్పించాలన్నారు. సాగులో ఉన్న అసైన్డ్ భూమి వివరాలు తెలపాలన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏవో మదనగోపాల్, సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
అన్ని సదుపాయాలతో బస్తీ దవాఖానలు
ఖమ్మం, జూలై 6: అన్ని సదుపాయాలతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానల పనులను కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాండురంగాపురం, మేదరబస్తీ, పాకబండబజార్ బస్తీ దవాఖానలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆవరణ లెవలింగ్ పనులను పూర్తి చేసి అవసరాలకు తగ్గట్టు షెడ్డు ఏర్పాటు చేయాలని, రూఫ్పై నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాము, కుక్క, కోతి కాటుకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షల నమూనాలు సేకరించి రిపోర్టులు ఇక్కడే పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20 వరకు అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ వెంకట్, డీఎంహెచ్వో మాలతి, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, డీఈలు రంగారావు, స్వరూపరాణి, నవ్యజ్యోతి, ఏఈ కుమార్ తదితరులు పాల్గొన్నారు.