కూసుమంచి రూరల్, జనవరి 6: ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, లేదా అని కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మండలంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఈశ్వరమాదారం, మంగలితండా, రాజుపేటబజార్ వాసులతో కలెక్టర్ మాట్లాడారు. కల్యాణలక్ష్మి ఎంతకాలానికి అందుతుందని ఈశ్వరమాదారం సర్పంచ్ ఎరబోలు సూర్యనారాయణరెడ్డిని అడగడంతో ఆరునెలలు పడుతుందని చెప్పగా, దరఖాస్తు చేయడంలో జాప్యం జరుగుతుందని, తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను 40 రోజుల్లోనే పరిష్కరిస్తున్నామని చెప్పారు.
రాజుపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లవాసులకు మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనన, మరణాల నమోదు, ఇండ్ల రిజిష్ర్టేషన్లు ఆన్లైన్లో చేస్తున్నారా, ఆఫ్లైన్లో చేస్తున్నారా అని పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నించగా, ఆన్లైన్లోనే చేస్తున్నామని చెప్పారు. ఇండ్లకు తాగునీటి పైపులైన్, విద్యుత్ లైన్ లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు చెప్పగా ఎమ్మెల్యే కందాళ ఇటీవల విద్యుత్ స్తంభాలకు నగదు చెల్లించారని వాటి ద్వారా లైన్లు పొడిగించాలని ఏఈ వెంకన్నను ఆదేశించారు.