దేశభక్తి పెంపొందేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా వజ్రోత్సవాల కమిటీ బాధ్యులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వజ్రోత్సవాలను పురసరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఇళ్లపై జాతీయజెండాలను ఎగురవేయాలని కోరారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 4: దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా వజ్రోత్సవాల కమిటీ బాధ్యులతో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వజ్రోత్సవాలను పురసరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఇళ్లపై జాతీయజెండాలను ఎగురవేయాలని కోరారు. ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒకరూ భాగస్వాములు అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుంచి 11 వరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని సూచించారు. వేడుకల ప్రారంభోత్సవ సమారోహం ఈ నెల 8న ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను మూడు రంగుల కాంతులతో సుందరంగా అలంకరించాలని సూచించారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. మేయర్ నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, అదనపు డీసీపీ శబరీశ్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాల షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 8న ప్రారంభ సమారోహం. 9న ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం. 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొకలు నాటడం, ఫ్రీడం పారుల ఏర్పాటు. 11న ఫ్రీడం రన్ నిర్వహణ, 12న వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్ఞప్తి, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు, 14న సాయంత్రం సాంసృతిక సారథి కళాకారులతో ప్రత్యేక సాంసృతిక, జానపద కార్యక్రమాలు, 15న స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిషరణలు, 16న ఏకకాలంలో ఎకడివారకడ ఉండి తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయడం, సాయంత్రం కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ, 19న దవాఖానలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ, 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు, 21న స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు, 22న ముగింపు కార్యక్రమం.