చర్ల, మార్చి 30 : చర్ల పీహెచ్సీ (కొయ్యూరు)లో మంగళవారం 117 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. పీహెచ్సీ వైద్యుడు శ్రీధర్, డీపీఎంవో చింతా వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో 60 సంవత్సరాలు పైబడినవారు 50మంది, 45 నుంచి 50 మధ్య వయసువారు 67 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు భయపడాల్సిన అవసరంలేదని ఎటువంటి ఇబ్బందులు రావని డాక్టర్ శ్రీధర్ అన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల, మార్చి 30: మండలంలోని పర్ణశాల పీహెచ్సీలో కరోనా నివారణ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వైద్యులు మణిదీప్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. గ్రామాల్లో 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తామని వైద్యులు తెలిపారు. శుక్రవారం నుంచి ఇప్పటివరకు 85 మందికి వ్యాక్సిన్ వేశామని, అందులో ఇద్దరికి చర్మవ్యాధులు ఉండటంతో తిరిగి పంపినట్లు మణిదీప్ తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ ముంతాజ్బేగం, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, స్టాఫ్నర్సు సుజాత, ఫార్మాసిస్ట్ కృపారాణి, హెల్త్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, సీఈవో నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పినపాకలో..
పినపాక, మార్చి 30: కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వద్దని 45 సంవత్సరాలు దాటిన వారందరూ టీకాలు వేయించుకోవాలని మెడికల్ ఆఫీసర్ శివకుమార్ తెలిపారు. మంగళవారం పీహెచ్సీలో వ్యాక్సిన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పీహెచ్సీ పరిధిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్క్ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.