సీఎం ఆదేశంతో ఆర్టీసీ సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్
నాలుగు రోజుల్లో 27 వేల మందికి టీకాలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్ పరిశీలన
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్ పరిశీలన
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 11: ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆర్టీసీ ఉద్యోగులకు జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ను ప్రారంభించామన్నారు. నాలుగు రోజులపాటు అన్ని జిల్లాల్లో దాదాపు 27 వేల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మొత్తం 35 కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ను దగ్గరుండి ఇప్పించాలని ఆర్ఎంను ఆదేశించారు. రోజురోజుకూ వైరస్ తీవ్రత పెరిగిపోతున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరూ విధిగా టీకా వేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, దానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఎంహెచ్వో బీ.మాలతి, ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పోరాడి ఓడిన సన్రైజర్స్..కోల్కతా బోణీ
బెయిర్స్టో ఔట్.. ఆశలన్నీ మనీశ్ పాండే పైనే
సన్రైజర్స్కు షాక్..10 పరుగులకే రెండు వికెట్లు
రాణా, రాహుల్ మెరుపులు..కోల్కతా 187/6