కేఎంసీ ఆత్మీయ సమావేశాల్లో
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, ఏప్రిల్ 11: మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని 18వ డివిజన్ అధ్యక్షుడు గోళ్ల వెంకట్-చంద్రకళ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని కోరారు. గతంలో 18వ డివిజన్గా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం 25వ డివిజన్గా మారిందన్నారు. ఈ డివిజన్ మరింత అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సీపీఎం నుంచి గోళ్ల మురళి, కొదుమూరి రామారావు, పాలాది వెంకటేశ్వర్లు, భూమా సతీశ్, కొండలు, సీహెచ్ గోపి, వీరభద్రం, నాగరాజు, నాగిశట్టి జయశంకర్, నవీన్లు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం 17వ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి మాట్లాడారు. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ విజయ్కుమార్, నీరజ పాల్గొన్నారు.