ఖమ్మం, జూన్ 3: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ నుంచి 94 మందికి మంజూరైన రూ.42.58 లక్షల విలువైన చెక్కులను గురువారం వీడీవోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి అజయ్కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో రూ.లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చికిత్సలు చేయించుకున్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నిండు మనస్సుతో తన సహాయ నిధి నుంచి సాయం మంజూరు చేస్తున్నారని అన్నారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.