ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణలో రైతుల పంట కల్లాల ఏర్పాటుపై కేంద్రం అవలంబిస్తున్న క్షక్షపూరిత వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని ధర్నాచౌక్ వద్ద రైతులతో మహాధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాముల్నాయక్, జడ్పీ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఎదుట ప్రారంభమయ్యే ఈ ధర్నాను విజయవంతం చేసి తెలంగాణ రైతులపై కేంద్రం అనుసరిస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.