కారేపల్లి, మే 28 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ను మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. కారేపల్లి మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత కారేపల్లి క్రాస్రోడ్లో అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అనంతారపు వెంకటాచారిని పరామర్శించి ఆర్థికసాయం చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కారేపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న కొనకండ్ల సత్యనారాయణ, చెవుల వెంకటేశ్వర్లు, సూర్యాతండా అజ్మీరా భద్రంను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. భాగ్యనగర్తండాలో అనారోగ్యంతో మృతిచెందిన బానోత్ నందా మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇటీవల మృతిచెందిన కారేపల్లి మేకల వెంకటయ్య, భాగ్యనగర్తండాలో లావుడ్యా మంగీలాల్, తులిస్యాతండాలో వాంకుడోత్ సునీత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు.
పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు తోటకూరి పిచ్చయ్య, ముత్యాల సత్యనారాయణ, ధరావత్ పాండ్యానాయక్, అజ్మీరా వీరన్న, భాగం నాగేశ్వరరావు, అడ్డగోడ ఐలయ్య, భూక్యా రంగారావు, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, తోటకూరి రాంబాబు, పర్సా పట్టాభి రామారావు, అడపా పుల్లారావు, ఈదర కోటేశ్వరరావు, పప్పుల నిర్మల, భూక్యా రాంకిషోర్, బానోత్ పద్మావతి, షఫీ, పిల్లి వెంకటేశ్వర్లు, సుడిగాలి భిక్షమయ్య, జాల సాంబ, ఆంగోత్ మత్రు, షేక్ గౌస్పాషా, జర్పల హచ్చు, అజ్మీరా అరుణ, బానోత్ సక్రు, ఇస్లావత్ సుజాత, బానోత్ రాందాస్, ఆదెర్ల రామారావు, బానోత్ వీరన్న, చెవుల చందు, జర్పల ప్రసాద్, జూపల్లి రాము, తొగర శ్రీను పాల్గొన్నారు.