ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయ ప్రారంభంలో ఎమ్మెల్యే సండ్ర
కల్లూరు, జూన్ 18: రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూరులోని ఎన్ఎస్పీ క్రాస్రోడ్డు వద్ద క్వార్టర్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జలవనరులశాఖ సర్కిల్ కార్యాలయాన్ని సీఈ శంకర్నాయక్తో కలిసి ఎమ్మెల్యే సండ్ర శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోందని, అందుకు నిదర్శనమే తెలంగాణలో ప్రతి ఆయకట్టుకూ సాగు నీరు, విద్యుత్ అందుతుండడమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి సీఈ కార్యాలయాన్ని కల్లూరుకు తీసుకొచ్చామని, నేటి నుంచి కల్లూరులో ఎస్ఈ కార్యాలయం కొనసాగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో రూ.8 కోట్లతో అధునాతన భవనం నిర్మించి అందులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకూ కూడా సేవలందించనున్నట్లు తెలిపారు. అనంతరం సీఈ శంకర్నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృషి ద్వారా వల్లనే ఈ కార్యాలయం కల్లూరుకు వచ్చిందని అన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే సండ్ర, సీఈ శంకర్నాయక్ కలిసి హరితహారం మొక్కలు నాటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు బీరవల్లి రఘు, కట్టా అజయ్బాబు, లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, లక్కినేని నీరజ రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, ఆనంద్కుమార్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.