వైరా టౌన్, అక్టోబర్ 30: రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా, కొణిజర్ల మండలాలకు సంబంధించిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు 15, సీఎంఆర్ఎఫ్ 28 చెక్కులను బీఆర్ఎస్ వైరా మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ లాల్మహ్మద్, దార్న రాజశేఖర్, వై.చిరంజీవి, చెరుకుమల్లి రవి, షేక్ రహీం, కౌన్సిలర్లు నందిని, పవిత్రకుమారి, కొణిజర్ల తహసీల్దార్ సైదులు, వైరా డిప్యూటీ తహసీల్దార్ రాము తదితరులు పాల్గొన్నారు.