కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 18 : ప్రజల చిరకాల స్వప్నమైన భద్రాచలం రోడ్- కొవ్వూరు రైల్వేలైన్ మంజూరు ప్రజల పోరాటానికి దక్కిన ప్రతిఫలమని రైల్వేలైన్ సాధన కమిటీ కన్వీనర్ కొదమసింహం పాండురంగాచార్యులు అన్నారు. రైల్వేలైన్ మంజూరు పట్ల హర్షం వ్యక్తంచేస్తూ బస్టాండ్ సెంటర్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులు చేపట్టేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వేలైన్ కోసం వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీన శంకుస్థాపన జరగనున్నది.
ఈ రైలుమార్గం ద్వారా ఖమ్మం, కొత్తగూడెం, పశ్చిమగోదావరి జిల్లా గిరిజన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికులకు కూడా సులభతరం అవుతుందన్నారు. సమావేశంలో బాలరాజు, సత్యనారాయణ, సలిగంటి శ్రీనివాస్, బానోత్ ధర్మ, గోపాలరావు, ఈశ్వరయ్య, హనుమంతరావు, పవన్కల్యాణ్, కల్లూరి కృష్ణ పాల్గొన్నారు.