కొత్తగూడెం అర్బన్, జనవరి 17: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు.
ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయించేందుకు రెండు నెలల్లోగా ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ రఘు, తహసీల్దార్లు రామకృష్ణ, వనమా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.