కారేపల్లి, మే 09 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవధ్వజ యంత్ర పుణప్రతిష్ఠ, గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహక కమిటీ, ప్రముఖ పురోహితుడు బ్రహ్మ రాజు అచ్యుత రామారావు శర్మతో కలిసి వేద పండితులు నాగసాయి శర్మ, కిరణ్ కుమార్ శర్మ, ఆదిత్య శర్మ, రాము శర్మ మూడు రోజులపాటు ప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యేక పూజలు శాస్త్రోతంగా నిర్వహించారు.

రామలింగాపురంలో కన్నుల పండువగా జీవధ్వజ ప్రతిష్ఠ
ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, కర్మణ, పుణ్యాహవచనం, గర్తన్యాసము, జీవధ్వజ యంత్రస్థాపన, ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన, పూర్ణహుతి, మండప ఉద్వాసనలు, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు లింగం బంజార, రామలింగాపురం గ్రామస్తులతో పాటు సమీప గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రామలింగాపురంలో కన్నుల పండువగా జీవధ్వజ ప్రతిష్ఠ