భద్రాచలం, డిసెంబర్ 9: అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి ఏపీవో డేవిడ్రాజ్ అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని వాటిని పరిష్కరించి.. మిగిలిన వాటిని ఆయా శాఖల అధికారులకు పరిష్కారం కోసం పంపించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిని ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయడంతోపాటు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఆర్సీవో గురుకులం నాగార్జునరావు, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఎస్వో భాస్కర్, ఏపీవో పవర్ ఏఈ మునీర్పాషా, ఎస్డీసీ ఉదయ్కుమార్, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.