బోనకల్లు/ చింతకాని/ ముదిగొండ, జనవరి 11: బీజేపీ నేతలకు దడ పుట్టించేలా ఈ 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు జనం చీమలదండులా తరలివస్తారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ జరుగడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. ఖమ్మం సభ విజయవంతం కోసం బోనకల్లు, చింతకాని, ముదిగొండల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి బుధవారం ఆయన సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బోనకల్లులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు అధ్యక్షతన ఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరగాల్సిన బహిరంగ సభ ఖమ్మంలో జరుగనుండడం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గం నుంచి 50 వేల మంది ప్రజలు సభకు తరలివస్తారని అన్నారు. నాయకులు వేమూరి ప్రసాద్, మోదుగుల నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు, బంధం నాగేశ్వరరావు, షేక్ నజీర్, ముడావత్ సైదా, మోర్ల మహేశ్వరరావు పాల్గొన్నారు.
చింతకానిలో..
చింతకాని మండలం నాగులవంచలో వద్దిరాజు మాట్లాడుతూ.. ఖమ్మం బహిరంగ సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. దేశమంతా ఈ సభవైపే చూస్తోందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలందరూ కలిసి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.
ముదిగొండలో..
ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో వద్దిరాజు మాట్లాడుతూ.. రానున్న కాలమంతా బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, సామినేని హరిప్రసాద్, తుపాకుల యలగొండస్వామి, బత్తలు వీరారెడ్డి, సిల్వరాజు, పోట్ల ప్రసాద్, మందరపు ఎర్ర వెంకన్న, కోటి అనంతరాములు, చావా శరత్, తోట ధర్మారావు, మీగడ శ్రీనివాస్యాదవ్, షేక్ కాజా, నీరుకొండ సతీశ్, షేక్ కాజా, నానబాల కిరణ్, పంది శ్రీను, చిరుమర్రి యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.