లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 4 : యువత.. మత్తుకు బానిసలవుతున్నారు. మద్యం, గంజాయి, కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు ఇటీవలి వరకు మత్తు కోసం దగ్గు మందులను అధికంగా తాగేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా పెయింట్లో కలిపే కెమికల్స్ను కూడా పీలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ తరహాలో యువత మత్తు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధమవుతున్నారు. మత్తుకు బానిసలవుతున్న యువతరం వారి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.
మత్తు కోసం, కిక్ కోసం యువత మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులపై ఆధారపడి బతికే వారు.. చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వారు.. ప్రతి రోజూ మద్యం తాగడం, చాలా ఎక్కువ ధర పెట్టి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయడం కష్టమైన పని. దీంతో వారు మత్తు కోసం ఏం చేయాలా అనే ఆలోచనలతోనే గడుపుతున్నారు. అందుకోసం ఇటీవలి కాలంలో దగ్గు మందులను విరివిగా వాడుతున్నారు. దగ్గు మందు కొని అధిక మొత్తంలో తాగితే మత్తు వస్తుండడంతో మెడికల్ షాపుల్లో వీటి కోసం ఎగబడే యువత ఎక్కువయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత అధికారులు ప్రిస్కిప్షన్ ఉంటేనే దగ్గు మందులు విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవి లభించడం కష్టమైపోయింది. ఇంకేముంది మరో మార్గం కనిపెట్టేశారు. పెయింట్లో కలిపే కెమికల్స్ను పీల్చడం ప్రారంభించారు.
యువత ఇప్పుడు మత్తు కోసం పెయింట్లో కలిపే కెమికల్స్కు అలవాటుపడ్డారు. ఇది ఇంకా ప్రాచుర్యం పొందకపోవడంతో వీటి అమ్మకాలు మామూలుగానే ఉంటున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. పెయింట్లో టిన్నర్ అనే కెమిమల్ను కలుపుతారు. అలాగే పాలీష్ కూడా పెయింటింగ్లో వేసేటప్పుడు ఉపయోగిస్తారు. పెయింట్ వేసేందుకు గదుల్లో వీటిని కలిపితేనే రంగులు వేసే వారికి మత్తు ఎక్కుతుంది. దీనిని కనిపెట్టిన యువత టిన్నర్, ప్యూ పాలీష్లను ఉపయోగించడం మొదలు పెట్టారు. వీటిని ప్లాస్టిక్ కవర్లలో పోసుకొని, అలాగే సీసా మూత తీసి వాసన పీలుస్తుంటారు. దీనివల్ల వా రికి మత్తు ఎక్కు తుంది. అ యితే మత్తు ఎక్కే వరకు వీటిని పీలుస్తారు. వీటిని కేవలం పీల్చడం చేస్తుండడంతో చాలా రోజుల వరకు ఉప యోగించుకునే అవకాశం ఉం టుంది. దీంతో వీటిని ఇప్పుడు యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
టిన్నర్, ప్యూ పాలీష్లను పీల్చడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో కెమికల్స్ను కలపడం వల్ల వీటిని పీల్చేవారు అనారోగ్యం బారిన పడతారు. సాధారణంగా వీటిని పెయింటర్లు కూడా పలు జాగ్రత్తలు తీసుకొని కలుపుతారు. గదుల్లో కలపకుండా బయటనే వీటిని మిక్సి చేస్తారు. గదుల్లో కలిపితే మత్తు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తాయని పలువురు పెయింటర్లు పేర్కొన్నారు. వీటిని అధిక మొత్తంలో పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, లంగ్స్ లాంటివి దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్న వయసులోనే యువత ఇలాంటి వాటికి అలవాటుపడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
పెయింటింగ్లో కలిపే కెమికల్స్ వల్ల ముక్కు, గొంతుకు తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కెమికల్స్కు బా నిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు కెమికల్స్ వాడకూడదు. కొద్దిసేపు ఇచ్చే మత్తు కోసం కెమికల్స్కు బానిసలైతే భవిష్యత్తులో అనేక రకాలైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
-డాక్టర్ రవిబాబునాయక్, ఆర్ఎంవో, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి