సారపాక, అక్టోబర్ 13: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది గులాబీ గూటికి చేరుతున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. సారపాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయం వచ్చేసిందని, ఈ సమయంలో కొందరు స్వార్థపూరిత రాజకీయాలతో ప్రజల మధ్యకు వస్తారన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనన్నారు.
వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యకర్తలు బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిగడపకూ తీసుకువెళ్లాలన్నారు. గెలుపు కోసం ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేసే వారికి మున్ముందు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసి చూపెట్టిందన్నారు. సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, నాయకులు శ్రీను, గుల్ మహ్మద్, శ్రీహరి, ఖాదర్, కృష్ణారెడ్డి, లక్ష్మీ చైతన్యరెడ్డి, పూర్ణ, బాలాజీ పాల్గొన్నారు.
బూర్గంపహాడ్, అక్టోబర్ 13: మోరంపల్లిబంజర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు శుక్రవారం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. వారికి ప్రభుత్వ విప్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కైపు నాగిరెడ్డి, యారం శ్రీనివాసరెడ్డి, పేరం సుబ్బారెడ్డి, డి.అశోక్, గురుతేజ, కృష్ణ, నవీన్, గంటా సంతోశ్, రంజిత్, గంటా శ్రీకాంత్, నరేంద్ర, హేమంత్, వాసు, సారంగపాణి, బొంబాయి సాయి, సాగర్, సాయికుమార్, రాజేశ్, కాంతయ్య, శ్రీను ఉన్నారు. కామిరెడ్డి రామకొండారెడ్డి పాల్గొన్నారు.