బూర్గంపహాడ్ (భద్రాచలం), ఆగస్టు 16 : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆం ధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆలయ ఈవో, అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. అయితే వీరిపై ఆక్రమణదారులు కర్రలతో దాడులు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మా రింది. అటు ఆక్రమణదారులు, ఇటు ఆలయ సిబ్బంది మధ్య ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో సంబంధిత శాఖల అధికారులు అక్కడకు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా రామాలయ భూ ములకు అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ అ క్రమ కట్టడాలను మాత్రం ఆక్రమణదారులు ఆపడంలేదు. 1970 నుంచి 2022 వరకు ఏపీ హైకోర్టుతోపాటు స్థానిక, జిల్లా, ఎండోమెంట్ ట్రైబల్ సెటిల్మెంట్ కోర్టులు, తెలంగాణ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగానే ఉత్తర్వులు ఇచ్చాయని ఆలయ ఈవో తెలిపారు. అయినప్పటికీ ఈ ఆక్రమణలు మా త్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నా రు. గతంలో 250 వరకు, తాజాగా 46 వరకు కేసులు ఆక్రమణదారులపై ఉన్నాయి.
కానీ అ వేవీ పరిష్కారం కాలేదు. అయితే, ఆలయ భూముల్లో ఆక్రమణదారులు అక్రమ కట్టడాలు కట్టడం వల్ల దేవస్థానానికి వచ్చే కూరగాయలు, ఇతరత్రా ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని ఆలయ ఈవో చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీ రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు రెండు నెలల క్రితం నిర్మాణాలు చేయొద్దని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికే 50 శాతం నిర్మాణాలు ఆక్రమణదారులు పూర్తిచేశారు. దీంతో ఇటు భద్రాద్రి ఆలయ బాధ్యులు, అటు ఏపీ అధికారులు మండిపడుతున్నారు. తహసీల్దార్ ఆదేశాలు కూడా ఆక్రమణదారులు పాటించుకోవడం లేదు.