సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీపికబురు అందించింది. ఇప్పటికే ఈ నెలలో దసరా అడ్వాన్స్ ప్రకటించగా.. బుధవారం సీఎం కేసీఆర్ 30 శాతం లాభాల వాటా చెల్లిస్తామని తెలిపారు. దీనికితోడు దీపావళి బోనస్ కూడా రూ.76,500 రానున్నది. అక్టోబర్లో జీతంతోపాటు ప్రతి కార్మికుడు దాదాపు రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు అందుకోనున్నాడు. సంస్థ వ్యాప్తంగా 44,500 మంది కార్మికులకు లాభం చేకూరనుంది. లాభాల వాటా డబ్బులు అక్టోబర్ 1వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమకానున్నాయి. దీంతో కార్మికులు గనులపై సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు.
కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 28 : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దిశానిర్దేశనంలో సీఎండీ శ్రీధర్ పర్యవేక్షణలో సింగరేణి సంస్థ ప్రగతి పథంలో దూ సుకుపోతున్నది. ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ నాయకుల సమష్టి కృషితో ఈ ఎనిమిదేండ్ల లో దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని ప్ర గతిని నమోదు చేసుకున్నది. కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి 2021-22 సంవత్సరంలో రికార్డుస్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్ సా ధించింది. ఈ టర్నోవర్పై పన్నులు విధించడానికి ముందే రూ.1,722 కోట్ల లాభాలు ఆర్జించినట్టు సీ ఎండీ శ్రీధర్ బుధవారం ప్రకటించారు. సింగరేణి సంస్థ బొగ్గు విద్యుత్ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) ఉన్నట్లు తెలిపారు. అలాగే గతేడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.3,596 కోట్లు చెల్లించినట్టు ఆయన వెల్లడించారు.
అక్టోబర్ 1న లాభాల వాటా చెల్లింపు
సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నిర్ణయించి ఆదేశించినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా ప్రకటించిన కేసీఆర్కు కార్మికుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ యేడాది లాభాల వాటా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని వివరించారు. దాదాపు 44,500 మంది కార్మికులకు లాభాల వాటా అక్టోబర్ 1వ తేదీన చెల్లించనున్నట్లు ప్రకటించారు. కాగా.. కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు సింగరేణి యాజమా న్యం సర్క్యులర్ కూడా జారీ చేసింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు, ట్రైనింగ్, బదిలీ వర్కర్లుగా చేరిన కొత్త కార్మికులకు రూ.12,500 చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్మికుల వేతనాలతోపాటు జమ చేయనున్నట్లు పేర్కొంది. మరో పది రోజుల్లో దీపావళి బోనస్ రూ.76,500 చేతికందనుండడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెలలో వేతనంతోపాటు దసరా అడ్వా న్స్, దీపావళి బోనస్, లాభాల వాటా డబ్బులు ఖాతాల్లో జమకాన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్మికుల కష్టాలు తెలిసిన మనిషి అని కార్మికులు పేర్కొంటున్నారు. సింగరేణి సంస్థ 1999-2000 సంవత్సరంలో మొదటగా రూ.300 కోట్లు లాభాలు గడించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడకుండా లాభాలు గడిస్తూ దేశంలోనే ప్ర భుత్వరంగ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 10 శాతం నుంచి 16 శాతం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మికులు లాభాల వాటా పొందగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ 30 శాతానికి పెంచారు.
స్వరాష్ట్రంలో అద్భుత ప్రగతి
తెలంగాణకు పూర్వం 2013-14 సంవత్సరం లో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి 2021-22 నాటికి 29 శాతం వృద్ధితో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 2013-14లో 479 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సంస్థ 2021-22 నాటికి 37 శాతం వృద్ధితో 655 లక్షల టన్నుల రవాణా జరిపింది. 2013-14లో రూ.11,928 కోట్ల అమ్మకాలు జరగగా.. ప్రస్తుతం రూ.26,607 కోట్లకు చేరుకుంది. లాభాలు కూడా గరిష్ఠంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో రూ.419 కోట్ల నికర లాభం సాధించగా, 2021-22 నాటికి రూ.1,227 కోట్లకు చేరింది.
టీబీజీకేఎస్ సంబురాలు
సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు 30 శాతం లాభాల వాటా ప్రకటించడంతో గనులపై సంబురాలు అంబరాన్నంటాయి. టీబీజీకేఎస్ ఆధ్వర్యం లో గోదావరికాలనీ(షిర్కె) చౌరస్తాలో సీఎం కేసీఆర్, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చౌరస్తా లో యూనియన్ నాయకులు, కార్మికులు పెద్దసం ఖ్యలో తరలివచ్చి పటాకులు కాల్చారు. మందమ ర్రి పట్టణంలోని మార్కెట్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.