మధిర టౌన్, సెప్టెంబర్ 24: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో రూ.కోట్ల నిధులు తెచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మధిర పట్టణంలో ఆదివారం పర్యటించిన ఆయన.. అంబాపేట 3వ వార్డులో రూ.1.11 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లలో ఇప్పటికే మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు సహా ట్యాంక్బండ్, సమీకృత మార్కెట్, వంద బెడ్ల ఆసుపత్రి, మినీస్టేడియం, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఖమ్మం సభలో మధిర మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 కోట్లు నిధులు ప్రకటించారని, వాటితోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బిక్కి ప్రసాద్, జయాకర్, శ్రీనివాసరావు, భారతి, సర్వయ్య, జేవీరెడ్డి పాల్గొన్నారు.
మధిర పట్టణంలో బాధిత కుటుంబాలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆదివారం పరామర్శించారు. చేడే వెంకటేశ్వరరావు, గూడెల్లి వెంకటనర్సయ్య కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మందడపు రామకృష్ణ తల్లి ఇటీవల మృతిచెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. వంగవీడులో కస్నానాయక్ తల్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బీఆర్ఎస్ నాయకులు పల్లపోతు వెంకటేశ్వరరావు, ప్యారీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.