దుమ్ముగూడెం, డిసెంబర్ 24 : ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం ములకపాడులోని చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన క్రిస్మస్ ప్యాక్లు 190 మంది క్రైస్తవులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, ఆర్ఐలు ఆదినారాయణ, పూనెం లక్ష్మయ్య, సర్వేయర్ సున్నం నర్సయ్య, బీఆర్ఎస్ మండల కార్యదర్శి కణితి రాముడు, పాస్టర్ యోహాన్, క్రైస్తవులు పాల్గొన్నారు.