ఖమ్మం సిటీ, జనవరి 6: అనేక దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానగా సేవలందించిన పెద్దాసుపత్రి పేరు ‘ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి’గా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఈ పెద్దాసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాలను మంజూరు చేసిన విషయం విదితమే.
అదనపు వైద్యులు, సిబ్బందితోపాటు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న నేపథ్యంలో పెద్దాసుపత్రిని పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాలగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే పెద్దాసుపత్రి ముఖద్వారం వద్దనున్న పేరు మార్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు తెలిపారు.