ఖమ్మం రూరల్, జనవరి 4: ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం మండలంలోని జలగంనగర్, ఏదులాపురం గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమా న్ని ఆయన పరిశీలించారు. ప్రజాపాలనకు వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలకు దరఖా స్తు చేసుకుంటున్న ప్రజలతో మాట్లాడారు. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, తిరస్కరించడానికి వీలు లేదన్నారు. కేంద్రా ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, డీఈవో కారి సోమశేఖరశర్మ, జిల్లా ఉపాధి కల్పనాధికారి కే శ్రీరాం, ఎంపీడీవో రవిందర్రెడ్డి, తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు.
కొణిజర్ల, జనవరి4: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లే కుండా దరఖాస్తులు స్వీకరించాలని జడ్పీ సీఈవో వింజం అ ప్పారావు, అడిషనల్ కలెక్టర్ మయాంక్సింగ్ అధికారులకు సూ చించారు. తుమ్మలపల్లి, కొండవనమాల గ్రామాల్లో జరిగిన గ్రామసభలను వారు పరిశీలించి మాట్లాడారు.
ముదిగొండ, జనవరి 4: మండలంలోని గోకినేపల్లిలో ప్రజాపాలనను గురువారం ఖమ్మం ఆర్డీవో గణేశ్ పరిశీలించి సిబ్బంది, దరఖాస్తుదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు అందరికీ అందేలా చూడాలని, దరఖాస్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దని, ప్రతి దరఖాస్తుపై నెంబర్ వేసి ఇంటింటికెళ్లి అందించాలన్నారు. వల్లభి, వెంకటాపురం, గోకినేపల్లి గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించారు.
తల్లాడ, జనవరి 4 : ప్రజాపాలన దరఖాస్తులను ప్రజలకు ఇబ్బంది లేకుండా స్వీకరించాలని అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లారం, రేజర్ల, పినపాక గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలను ఆయన పర్యవేక్షించారు. సర్పంచ్లు దుగ్గిదేవర సామ్రా జ్యం, తేలపుట్ల స్వరాజ్యం, కొమ్మినేని ప్రభాకర్రావు, ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.
సత్తుపల్లిరూరల్, జనవరి 4: ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామసభలో దరఖాస్తులు చేసుకున్న దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆర్డీవో అశోక్చక్రవర్తి అన్నారు. గన్నారం, సిద్ధారం, గౌరీగూడెం, బేతుపల్లి గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ యోగేశ్వరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఏపీవో బాబురావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, సర్పంచ్ మండేపాటి శ్రీనివాసరెడ్డి, కాకాలపాటి శ్రీనివాసరావు ఉన్నారు.
చింతకాని, జనవరి 4: ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని ఖమ్మం ఆర్డీవో గణేశ్ అన్నారు. మండలంలోని 4గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామసభల్లో మొత్తం 3,649 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎన్ రమేశ్, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ తెలిపారు. పాతర్లపాడు, ప్రొద్దుటూరు, గాంధీనగర్, నాగిలిగొండ గ్రామాలను ఆర్డీవో సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.
కూసుమంచి, జనవరి 4: అభయహస్తం ప్రజాపాలన గ్రామ సభల్లో 80 నుంచి 95 శాతం మంది దరఖాస్తులు అందజేస్తున్నారని ఎంపీడీవో ఆర్ రమాదేవి తెలిపారు. మండలంలోని ఈశ్వరమాధారం, మంగలితండాలో గురువారం గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించారు. లోక్యాతండా, అగ్రహారం గ్రామసభల్లో తహసీల్దార్ సంపత్కుమార్, జీళ్లచెరువులో ఎంపీవో రాచందర్రావు, ఏవో వాణి దరఖాస్తులు స్వీకరించారు. సూర్యానారాయణ రెడ్డి, కొండా సత్యం, వలీయుద్దీన్, సుజన్, రంజిత్రెడ్డి, సత్యవర్ధన్ రాజు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన సభలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పంగిడి గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామసభను ఆయన పర్యవేక్షించారు.
తిరుమలాయపాలెం, జనవరి 4: మండలంలోని సుబ్లే డు, మేడిదపల్లి, రఘునాధపాలెం, దమ్మాయిగూడెం, సుద్దవాగుతండా ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ రాం ప్రసాద్, ఎంపీవో రాజేశ్వరీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మధిర, జనవరి 4: ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలకు సంబంధించి అర్హులైన పేదల నుంచి ఒకే దరఖాస్తు స్వీకరిస్తున్నామని తహసీల్దార్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 18వ వార్డులో కౌన్సిలర్ రజినికి దరఖాస్తులు అందజేశారు.
ఎర్రుపాలెం, జనవరి 4: మండలంలోని శఖునవీడు, వెంకటాపురం, ఇనగాలి, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వేణుమనోహర్, ఉషాశారద, శ్రీనివాసరావు, విజయభాస్కర్రెడ్డి, భాస్కర్రెడ్డి, బొగ్గుల లక్ష్మీ, యరమల రేణుక, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పెనుబల్లి, జనవరి 4: పెనుబల్లి రైతువేదికలో చేపట్టిన గ్రామసభను ఆర్డీవో చక్రవర్తి పరిశీలించారు. గ్రామసభలకు వచ్చే ప్రతిఒక్కరికీ దరఖాస్తులు స్వీకరించాలని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వైరారూరల్, జనవరి 4: మండలంలోని గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు దారులు అధికారులకు అభయహస్తం దరఖాస్తులను అందజేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వైరాటౌన్, జనవరి 4: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను మున్సిపాల్ చైర్మన్ సూతకాని జైపాల్, అధికారులకు అందజేశారు. స్పెషలాఫీసర్ కస్తాల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ డీ కరుణాకర్రెడ్డి, వార్డు కౌన్సిలర్ దారెల్లి పవిత్ర, ఎంఈవో వెంకటేశ్వ ర్లు, డిప్యూటీ తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వేంసూరు, జనవరి 4: ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. కందుకూరు, అమ్మపాలెం గ్రామాల్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో రంజిత్కుమార్, ప్రత్యేక అధికారి హుస్సేన్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, జనవరి 4: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఆరు గ్యారెంటీల్లోని ప్రభుత్వ పథకాలు మంజూరవుతాయని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఎర్రబోడు, విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గురువారం జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. కొత్తతండాలో అదనపు కలెక్టర్ మధుసూధన్నాయక్, పాటిమీదగుంపులో డీఆర్డీవో పీడీ విద్యాచందన, గుంపెళ్లగూడెంలో ప్రత్యేకాధికారి అజయ్కుమార్ పాల్గొన్నారు.