బోనకల్లు : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ గ్రూప్లో యశ్వంత్ఆదిత్య 426/470, మరీదు శైలజ 419/470, బోయినపల్లి సతీష్ 402/470, గోపగాని ఉమా 382/470, బైపీసీ గ్రూప్లో పండగ పూజిత 397/440, మరీదు శైలజ 358/440, హెచ్ఈసీ గ్రూప్ లో 363/500, సీఈసీలో దోసపాటి వాసంతి 337/500 మార్కులు సాధించింది. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని, అధ్యాపకులు అభినందించారు.